12 మంది మావోయిస్టులు లొంగుబాటు

by Elthuri vijay kumar |

ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఐదుగురు మహిళలతో సహా 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

12 మంది మావోయిస్టులు లొంగుబాటు
X

12 మంది మావోయిస్టులు లొంగుబాటు

దిశ భద్రాచలం : మావోయిస్టు కేంద్ర కమిటీ సీజ్ ఫైర్ ప్రకటించి 24 గంటలు గడవక ముందే మావోల లొంగుబాటు సంచలనంగా మారింది. బుధవారం ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఐదుగురు మహిళలతో సహా 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై 18 లక్షల రివార్డ్ ఉంది. పోలీస్ ఉన్నతాధికారి రాబిన్సన్ మాట్లాడుతూ.. 2025 లో ఇప్పటివరకు నారాయణపూర్ జిల్లాలో 177 మంది మావోయిస్టులు లొంగిపోయారని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి పునరావాసం ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఆర్ధిక సహకారం అందజేయనున్నట్లు తెలిపారు.

Next Story