- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ఖమ్మం BRS ఎంపీ అభ్యర్థి ఫిక్స్.. 6 నెలల ముందుగానే సీఎం KCR కీలక నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లకు మరో 6 నెలల సమయం ఉండగానే ఖమ్మం సెగ్మెంట్కు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు

X
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లకు మరో 6 నెలల సమయం ఉండగానే ఖమ్మం సెగ్మెంట్కు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు గులాబీ బాస్. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ బరిలోకి దిగుతారని కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాధ సభలో కేసీఆర్ నామా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రజల ఆశీస్సులతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ మరోసారి పార్లమెంట్లో అడుగు పెడతారని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయంగా ఉండగానే కేసీఆర్ అభ్యర్థిని ఫిక్స్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్గా మారింది.
Next Story






