బ్రేకింగ్: తెలంగాణకు రూ.2800 కోట్ల భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్‌తో డీల్..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: తెలంగాణకు రూ.2800 కోట్ల భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్‌తో డీల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేయిన్స్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. రూ.2800 కోట్ల పెట్టుబడితో ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేయిన్స్ టెక్నాలజీ సంస్థ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కేయిన్స్ టెక్నాలజీ సంస్థ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో రెండు వేల మంది యువతకు ఉపాధి లభించనుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలనుకున్న కేయిన్స్ కంపెనీ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.



Next Story

Most Viewed