- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు కేబినెట్ మీటింగ్ కొనసాగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ఈ మీటింగ్లో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన పెండింగ్ బిల్లుల విషయంపై కూడా ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
శాసన సభ, మండలి ఆమోదించిన 10 బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సీఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా కేబినెట్ భేటీలో గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సీఎస్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది.