రాహుల్, CM రేవంత్ రెడ్డి ఆల్రేడీ మేడిగడ్డను చూశారు.. మళ్లీ ఇప్పుడెందుకు?

by Disha Web Desk 2 |
రాహుల్, CM రేవంత్ రెడ్డి ఆల్రేడీ మేడిగడ్డను చూశారు.. మళ్లీ ఇప్పుడెందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన పొలిటికల్ విజిట్ అని కొట్టిపారేశారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఎద్దేశా చేశారు. మేడిగడ్డ లోపభూయిష్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు.. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సందర్శనకు కూడా కాంగ్రెస్ అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని.. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికనే రాష్ట్ర విజిలెన్స్ ఇచ్చిందని గుర్తుచేశారు. అదే నివేదికను రీటైప్ చేసి పంపారు తప్ప.. కొత్తగా ఏమీ లేదని అన్నారు. ఇప్పటికే మేడిగడ్డను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా చూసి వచ్చారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పోలీసులను పెట్టి నీటిని ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. పార్టీ అభివృద్ధి కోసం బహిరంగ సభలకు వెళ్తాడని మండిపడ్డారు.

Next Story

Most Viewed