- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘మేము ఇంకా గేట్లు తీయలేదు.. తీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే’
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశామని తెలిపారు. దానంపై చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.
మూడు నెలల్లో దానం విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము ఇంకా గేట్లు తీయలేదని.. గేటు తీస్తే కాంగ్రెస్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు అని.. కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని రేవంత్పై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.