- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు!
ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న పరీక్షల విధానంలో కీలక మార్పులు, సిలబస్ మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడున్న 100 శాతం రాత పరీక్షల మార్కుల విధానంలో స్థానంలో 80 శాతం రాత పరీక్షకు, 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని 2025–26 అమలు చేస్తామనిప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ ఇంటర్ బోర్డు లేఖ రాసింది. ఇంటర్లో ఇంటర్నల్ మార్కుల విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ విద్యా సంస్థ దాదాపు 90 శాతం ప్రైవేటు కాలేజీ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ లకు 20 మార్కులు కేటాయిస్తే ప్రైవేటు కాలేజీల పంట పండినట్లేనని, ఇక ప్రభుత్వ కాలేజీల మూసుకోవాల్సిందేనని, ప్రభుత్వంలో ఆడ్మిషన్లపై తీవ్రప్రభావం చూపుతుందని, వాటిల్లో చదివితే 20కి 20 మార్కులు వస్తాయని, ఇదే ఆస్త్రాన్ని ఉపయోగించి వారు ఆడ్మిషన్లు,ఫీజులు పెంచుకునే అవకావం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేసిన ప్రభుత్వం అదే ఇంటర్ కు వచ్చే సరికి 20 శాతం మార్కులను ఎలా కేటాయిస్తుందని విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విధానం పూర్తిగా ప్రేవేటు కాలేజీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ప్రాక్టికల్స్ మార్కుల విషయంలో ఏ ప్రభుత్వ కాలేజీలో రాని విధంగా ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం మార్కులు వస్తాయని, దీంతో బైపీసీ విద్యార్థులు అత్యధిక ఆ మార్కుల కోసమైన ప్రవేటు కాలేజీల్లో చేరుతారని కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఇక అంతే సంగతులని, ప్రైవేటు కాలేజీల వ్యాపారం మరింత జోరందుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మార్చిన సిలబస్ అంత సిద్దమైంది. అమలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లుగా సమాచారం.






