కేశ‌వ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

by Nallavelli.Anjaneyulu |

త్రివేణి సంగ‌మం కందకుర్తి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా నిర్మించిన కేశ‌వ స్పూర్తి కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ శ‌నివారం ప్రారంభించారు.

కేశ‌వ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ‌, బోధ‌న్ : త్రివేణి సంగ‌మం కందకుర్తి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా నిర్మించిన కేశ‌వ స్పూర్తి కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ శ‌నివారం ప్రారంభించారు. స్ఫూర్తి కేంద్రంలో ప్ర‌తిష్టించిన ఆర్ఎస్ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు కేశ‌వ‌రావు బ‌లిరాం పంత్ హెగ్డే వార్ విగ్రహం, భార‌త మాత విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం పుష్పాల‌తో న‌మ‌స్క‌రించారు. స్పూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాల‌రీల‌ను ప‌రిశీలించారు. విజిట‌ర్ బుక్ లో సందేశం రాశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ఎస్ఎస్ సంఘ పెద్ద‌లు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధ‌ర్మ‌పురి, నిజామాబాద్ అర్భ‌న్ ఎమ్మెల్యే ధ‌న్ పాల్ స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story