యాసంగి మొక్కజొన్న పంట కొనుగోలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
యాసంగి మొక్కజొన్న పంట కొనుగోలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: యాసంగి మొక్కజొన్న కొనుగోలుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక, యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు కాగా.. 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా మొక్కజొన్న పంటు సాగు చేస్తుండగా.. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.1962 మద్దతు ధర ఇస్తోంది.

Next Story

Most Viewed