రానున్న రోజుల్లో వాళ్లదే హవా.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రానున్న రోజుల్లో వాళ్లదే హవా.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కీలకవ్యాఖ్యలు చేశారు. చింతమడకలో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 65-70 శాతం పోలింగ్ జరిగే చాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బాగా జరుగుతుందన్నారు. ఇండియా కూటమిలో చేరుతారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బీజేపీ పార్టీ రూల్ ప్రకారం 75 ఏళ్ల వయసు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరు. కాబట్టి ప్రధాని మోడీ కూడా తప్పుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు. అంతకుముందు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story

Most Viewed