ట్విట్టర్‌లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్!

by Disha Web Desk 14 |
ట్విట్టర్‌లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఎవరికైనా హామీ ఇస్తే వారికి ఇచ్చిన మాట తప్పకుండా కేటీఆర్ కలుస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నల్గొండ జిల్లాల్లోని రైతును కేటీఆర్ కలిశారు. తమ పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని మళ్ళీ కేసీఆరే సీఎం కావాలని రైతు మల్లయ్య ఒక వీడియోలో పేర్కొన్నారు.

రైతు మల్లయ్య వీడియో చూసి చలించిపోయి.. నల్గొండ వచ్చినప్పుడు మల్లయ్యను తప్పకుండా కలుస్తా అని ఇటీవల ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఇవాళ నల్లగొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆ రైతుకు భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed