ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో కేసీఆర్ విగ్రహాల తయారీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

by Disha Web Desk 3 |
ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో కేసీఆర్ విగ్రహాల తయారీ.. వైరల్ అవుతున్న ఫోటోలు
X

దిశ వెబ్ డెస్క్: రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన విషయం అందరికి తెలిసిందే. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు అని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అభిమానులు పోస్ట్ చేశారో లేక తయారీదారులు పోస్ట్ చేశారో తెలీదు కానీ.. ప్రస్తుతం కేసీఆర్ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలను తాయారు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కేసీఆర్ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలను చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. బతికే ఉన్నాడు కదా.. ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యమని చెప్పలేదా రామకృష్ణ.. చచ్చిపోలేదు కదా..? అప్పుడే విగ్రాహాలు తయారు చేస్తున్నారు..? రెస్ట్ ఇన్ పీస్ కేసీఆర్ అని వివిధ రకాలుగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు ఒకసారి చూసేయండి.

Next Story

Most Viewed