‘‘పార్టీనే ముఖ్యం’’.. కడియం, రాజయ్యలకు సీఎం KCR వార్నింగ్!

by Disha Web Desk 19 |
‘‘పార్టీనే ముఖ్యం’’.. కడియం, రాజయ్యలకు సీఎం KCR వార్నింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల మధ్య తరచూ గ్రూపు రాజకీయాలతో రచ్చకెక్కుతున్నారు. దీంతో ఇరువురిపై తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎం కేసీఆర్ సీరియస్ కావడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా.. పార్టీ కోసం కలిసి పని చేయాలని ఆదేశించారు. నిత్యం గొడవపడితే పార్టీకి మంచిదికాదని ఇకనైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని పేర్కొన్నారు. పార్టీకి నష్టం చేసేవారెవరు అయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. అందరూ ఎన్నికల టార్గెట్గా పనిచేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్య ఉన్న అధిష్టానంతో విన్నవించుకోండి అని సూచించారు. ఎవరైనా పార్టీ కట్టుదాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Also Read..

‘‘నీకు ఏం పని లేదా’’.. మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్..!

ఆ ఎమ్మెల్యేలకు ఇదే లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీటైతే..: సీఎం కేసీఆర్ సీరియస్



Next Story

Most Viewed