సెకండ్ టర్మ్‌లో ఫస్ట్ టైమ్ సెక్రెటేరియట్‌కు కేసీఆర్

by Disha Web Desk 4 |
సెకండ్ టర్మ్‌లో ఫస్ట్ టైమ్ సెక్రెటేరియట్‌కు కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) 2018లో రెండోసారి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా సచివాలయంలోని ఛాంబర్‌కు రాలేదు. కొత్త సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయడానికి 2018 జూలైలో వచ్చిన కేసీఆర్ ఎలాంటి అదికారిక కార్యకలాపాల్లో పాలుపంచుకోలేదు. కొత్త సచివాలయాన్ని నిర్మించి తన ఛాంబర్‌లోకి ప్రవేశించిన తర్వాత ఫైళ్ళపై ఫస్ట్ టైమ్ సంతకం చేశారు. ఈ నాలుగున్నరేళ్ళలో ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలన్ని,టికీ ప్రగతి భవన్ వేదిక అయింది. నాలుగున్నరేళ్ళ పాటు సచివాలయానికి అడుగు పెట్టని కేసీఆర్ తాను కోరుకున్న తీరులో నిర్మించిన కొత్త భవనం, ఛాంబర్‌లోకి అడుగు పెట్టి అపీషియల్ యాక్టివిటీలో పాల్గొనడం గమనార్హం.



Next Story

Most Viewed