- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంభమేళా మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్
by Muthe.Rajitha |
కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మౌని అమావాస్య సంధర్భంగా ప్రయాగ రాజ్ మహా కుంభ మేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపధ్యంలో సరియైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






