కవితమ్మా ధైర్యంగా ఉండండి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Hamsa |
కవితమ్మా ధైర్యంగా ఉండండి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, భీమ్‌గల్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ట్విట్టర్‌లో ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తాయి. అంత మాత్రాన వేట ఆపుతామా, కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతోపాటు ఉన్నాము. ఉంటాము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అని ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed