ఉరేసుకొని యువకుడు మృతి

by Elthuri vijay kumar |

- వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామంలో విషాదం

ఉరేసుకొని యువకుడు మృతి
X

ఉరేసుకొని యువకుడు మృతి

- వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామంలో విషాదం

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన సంఘా శరత్ (24) అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా ఇతడు అన్యమనస్కంగా ఉంటున్నాడు. చివరి సారిగా కొంత మంది స్నేహితులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నానని మెసేజ్ పెట్టగా వారు ఇంటికి చేరేసరికి ఉరేసుకొని తనువు చాలించాడు. అయితే గ్రామంలో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం కావచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పటికీ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Next Story