ఫుడ్ పాయిజన్ తో మహిళ మృతి.. ఎక్కడంటే..?

by Naveena |

రుద్రంగి మండల కేంద్రంలో ఓ మహిళ ఫుడ్ ఫాయిజన్ తో మృతి చెందింది.

ఫుడ్ పాయిజన్ తో మహిళ మృతి.. ఎక్కడంటే..?
X

దిశ, రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో ఓ మహిళ ఫుడ్ ఫాయిజన్ తో మృతి చెందింది. కాదాసు పుష్పలత (35 )ఆమె కుమారుడు నిహాల్ (6 )శుక్రవారం రాత్రి ఇంట్లో తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, వీరేశనాలు కావడంతో.. కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించి ఆదివారం పుష్పలత మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు నిహాల్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిహాల్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ప్రాథమిక విచారణ చేసి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Next Story