విద్యుదాఘాతంతో మహిళా మృతి

by Disha Web Desk 11 |
విద్యుదాఘాతంతో మహిళా మృతి
X

దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడిన ప్రమాదంలో మహిళా రైతు మృతి చెందింది. బుధవారం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన పంతంగి ఈశ్వరి (52), అనే మహిళ హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడిన ఘటనలో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా మృతురాలి భర్త గత రెండు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే మహిళ సజీవ దహనం అయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed