అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

by Ratna Kumari |

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మం

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం :  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
X

దిశ, గోదావరిఖని : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని జవహర్ నగర్‌లోని 54వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ ఎండి ముస్తఫా పాల్గొన్నారు.

Next Story