కాంగ్రెస్‌ ఓటుకు రూ.7 వేలు ఇస్తోంది: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-22 09:06:39  IST  )

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటుకు రూ.7 వేలు ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు..

కాంగ్రెస్‌ ఓటుకు రూ.7 వేలు ఇస్తోంది: బండి సంజయ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌(Congress)కు టీచర్ MLC అభ్యర్థి లేరని కేంద్రమంత్రి బండి సంజయ్‌(Union Minister Bandi Sanjay) వ్యాఖ్యానించారు. కరీంనగర్(KarimNagara)లో మీడియాతో మాట్లాడిన ఆయన పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటుకు రూ.7 వేలు ఇస్తోందని ఆరోపించారు. డబ్బుల కోసమే LRS పెట్టారన్నారు. రేవంత్‌రెడ్డి LRS డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజల కోసం కొట్లాడటమే తనకు ముఖ్యం బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

కాగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగబోతున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మాటల తూటాల పేలుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు బీజేపీ లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. కరీంనగర్‌లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రులను మోసం చేస్తోందని ఆరోపించారు.

Next Story