ప్రమాదంలో గుర్తు తెలియని యువకుని మృతి..

by Bhanu |

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామ శివారులో పరకాల- హుజురాబాద్ ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని యువకుడు (35)మృతి చెందాడు.

ప్రమాదంలో గుర్తు తెలియని యువకుని మృతి..
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ మండలం కందుగుల గ్రామ శివారులో పరకాల- హుజురాబాద్ ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని యువకుడు (35)మృతి చెందాడు. సిఐ కరుణాకర్ కథనం మేరకు..గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతుడు తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన సమీప రైస్మిల్ కూలీలు 108 వాహనంలో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు పంపించారు.చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎరుపు రంగు హోండా ఏపీ 13 ఎస్7055 బైక్ పై ప్రయాణించి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుని వివరాలు తెలిసినవారు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు గాని, సిఐ 8712670773 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story