- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి తల్లిదండ్రుల వేధింపులు తాళలేక.. ఓ యువకుడు ఆత్మ హత్య
ప్రేమించిన యువతి తల్లి దండ్రులతో పాటు పోలీస్ ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం మంథనిలో వెలుగులో కి వచ్చింది.

X
దిశ, మంథని : ప్రేమించిన యువతి తల్లిదండ్రులతో పాటు పోలీస్ ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం మంథనిలో వెలుగులోకి వచ్చింది. మృతిని తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కి చెందిన ఓ కౌన్సిలర్ కుమార్తె, పెరుగు సతీష్ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేయకుండా అవమానించి ఓ పోలీస్ అధికారి ద్వారా బెదిరించడంతో తన కొడుకు మన స్థాపం చెంది గత నెల ఫిబ్రవరి 15 న గడ్డి మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేయాలనీ మృతుని తల్లి హెచ్ఆర్సిలో పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన మంథని పట్టణంలో చర్చనియంశంగా మారింది. ఇదే విషయంపై పోలీస్ అధికారిని దిశ రిపోర్టర్ వివరణ కొరగా తనకు ఎలాంటి సంబందం లేదని తెలిపారు.
Next Story






