విద్యుదాఘాతంతో రెండు మూగజీవాలు మృతి

by velandi.Saikiran |

: విద్యుత్ షాక్ తో మూగ జీవాలు మృతి చెందిన సంఘటన బుధవారం ఖానాపూర్ లో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో రెండు మూగజీవాలు మృతి
X

దిశ, మంథని : విద్యుత్ షాక్ తో మూగ జీవాలు మృతి చెందిన సంఘటన బుధవారం ఖానాపూర్ లో చోటుచేసుకుంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన జిల్లా శ్రీనివాస్ తన మేకలను మేతకు తీసుకువెళ్లగా, అదే గ్రామానికి చెందిన దేవుని శ్రీనివాస్ పొలం వద్ద కరెంటు తీగ మీద పడడంతో ఆ రెండు మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన మూగజీవాల విలువ సుమారుగా రూ.40 వేలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నారు. ఇక ఒకేసారి రెండు మూగజీవాలు మృత్యువాత పడడంతో బాధితుడు జిల్లా శ్రీనివాస్ తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు.

Next Story