టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ద‌గ్ధం

by velandi.Saikiran |

టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ద‌గ్ధం చేసిన సంఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలోని కేసీఆర్ నగర్ లో చోటు చేసుకుంది.

టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ద‌గ్ధం
X

దిశ, ఎల్లారెడ్డిపేట : టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ద‌గ్ధం చేసిన సంఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలోని కేసీఆర్ నగర్ లో చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గురువారం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాల‌నీ వ‌ద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీని ఎల్లారెడ్డిపేట కు చెందిన అంగూరి ప్రభాకర్, హాబీబ్ లు చింపి, కాల్చి వేశారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మండల టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కదిరే భాస్కర్ గౌడ్. దీనిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Next Story