కొబ్బరికాయల నుంచి ప్రసాదాల వరకు… జాతర టెండర్లు నేడే

by Batti.Sumithra |

శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి పూజ సామాగ్రి విక్రయాలు, ఇతర సేవల హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.

కొబ్బరికాయల నుంచి ప్రసాదాల వరకు… జాతర టెండర్లు నేడే
X

దిశ, ​హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని రంగనాయకుల గుట్ట వద్ద ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి పూజ సామాగ్రి విక్రయాలు, ఇతర సేవల హక్కుల కోసం మంగళవారం (నేడు) బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతరలో వివిధ సేవల నిర్వహణ కోసం ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

​కొబ్బరికాయలు, బెల్లం అమ్మకాలు, ​గద్దెల వద్ద బెల్లం (బంగారం) పోగు చేసుకోవడం, ​ప్రసాదాల విక్రయం, ​తలనీలాలు సేకరించడం, ​తల్లి ఆరాధన కోళ్లు, కొబ్బరి ముక్కల సేకరణ కోసం టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ​ఆసక్తి గలవారు మంగళవారం ఉదయం 10 గంటల నుండి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ​ఒక్కో వేలానికి రూ. 30,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ​గతంలో బాకీ ఉన్న వారు ఈ వేలంలో పాల్గొనడానికి వీలు లేదన్నారు.​ వేలం పాటలో తగినంత సొమ్ము రాకపోయినా లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల వేలం పాటను రద్దు చేసే పూర్తి అధికారం అధికారులకు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ​భక్తులకు అసౌకర్యం కలగకుండా, జాతరను విజయవంతం చేసేందుకు వ్యాపారులు, ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొనాలని అధికారులు కోరారు.

Next Story