వేధింపులు తాళలేక.. తండ్రిని చంపిన తనయుడు

by Disha Web Desk 6 |
వేధింపులు తాళలేక.. తండ్రిని చంపిన తనయుడు
X

దిశ, కోరుట్ల రూరల్: మద్యానికి బానిసై నిత్యం కుటుంబ కలహాలకు కారణమవుతున్న తండ్రిని ఓ తనయుడు రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన మండలంలోని సంగెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మండలంలోని సంగెం గ్రామానికి చెందిన వల్లకొండ చిన్నమల్లయ్య(52) కు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న మల్లయ్య గత పదిహేను సంవత్సరాలు గల్ఫ్ లో పనిచేసి ఇటీవల తిరిగి వచ్చాడు. కాగా గల్ఫ్ నుంచి సెలవుపై వచ్చిన ప్రతిసారి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ప్రస్తుతం గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడే ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై ప్రతిరోజూ ఇంట్లో ఏదో గొడవ సృష్టించి అందరినీ వేధించేవాడు. ఈ వేధింపులు తీవ్రమవడంతో గురువారం అర్ధరాత్రి చిన్న మల్లయ్య పెద్దకొడుకైన వల్లకొండ పవన్ క్షణికావేశంలో తండ్రిని రోకలిబండతో మోదాడు. దీంతో చిన్న మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పవన్ పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed