మొహర్రం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

by velandi.Saikiran |   (  Updated:2026-06-20 13:21:12  IST  )

మొహరం (పీర్ల) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కోరుట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మొహర్రం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
X

దిశ, కోరుట్ల రూరల్: రాబోయే మొహరం (పీర్ల) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కోరుట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ చిరంజీవి సమక్షంలో పీర్ల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ, మొహరం పండుగను ఈ నెల 27న మాత్రమే నిర్వహించాలని హిందూ, ముస్లిం సోదరులు పరస్పర సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. కొన్ని గ్రామాలు, కాలనీల్లో కొంతమంది ఈ నెల 26న పీర్ల పండుగ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఆయా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా పిలిపించి అధికారికంగా జూన్ 27న మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

Next Story