జగిత్యాలలో బీజేపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి కీలక నేత

by Disha Web Desk 4 |
జగిత్యాలలో బీజేపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి కీలక నేత
X

దిశ, బీర్పూర్: జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీర్పుర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎలగందుల చంద్ర శేఖర్, వారి అనుచరులు పోలాస గోవర్దన్,యశోద సాయి తేజ మరికొంత మంది నాయకులు సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు,రైతు బంధు జిల్లా మెంబర్ కోలుముల రమణ,మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు,రమకిస్టు గంగాధర్,యూత్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రంగౌడ్,సోషల్ మీడియా అధ్యక్షుడు వినోద్,సర్పంచులు యేసు దాసు, బందెల మరియ రాజేశం,నాయకులు చెన్న గంగన్న,సంతోష్,తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed