'నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం'

by Dishanational2 |
నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
X

దిశ,చందుర్తి : మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న బోడిగే శోభ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. చందుర్తి మండలం‌లో ఇప్పటి వరకు ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా నిర్మించని సర్కారు దండగ అని, జర్మనీ లో ఉండే ఎమ్మెల్యే వాళ్ళ ప్రజలకు లాభం లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలాగా పనిచెయ్యాలని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడీ దారుల కుటుంబం అయిందని, దళిత ముఖ్యమంత్రి హామీ మరచిన ముఖ్యమంత్రి కి వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా చూపిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, బూత్ అధ్యక్షులు సిర్రం తిరుపతి,ఇంచార్జి క్యాతం దశరథ రెడ్డి,సిరికొండ తిరుపతి,అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్,వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి రెగుల మల్లికార్జున్,మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇంచార్జిలు,బాత్ అధ్యక్షులు,వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed