రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి..

by Bhanu |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి..
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు పోలీసుల కథనం మేరకు.. చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన లింగమూర్తి పని నిమిత్తం చిన్నకోడూరు వెళ్లి తిరిగి వస్తూ కొత్తపెల్లి వద్ద రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో లింగమూర్తికి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story