రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్రగాయాలు

by Bhanu |

రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది.కరీంనగర్ మండలం ఇరుకుల్ల బస్ స్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్రగాయాలు
X

దిశ, కరీంనగర్ రూరల్ : రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది.కరీంనగర్ మండలం ఇరుకుల్ల బస్ స్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కరీంనగర్ వైపు నుండి గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి మొదటగా బైక్ నడుపుతున్న వ్యక్తి కి ఢికొనగ స్వల్పంగా గాయపడ్డాడు తరువాత పక్కనే వెళ్తున్న కారును ఢీకొని అనతరం రామగుండం నుండి వస్తున్న లారీ ని వేగంగా ఢీకొనడంతో రెండు లారీల డ్రైవర్లు తీవ్రంగా గాయపడి క్యాబిన్లలో ఇరుక్కు పోవడంతో విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రలను స్థానికుల సహాయంతో లారీ క్యాబిన్ నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story