'ప్రజావాణి' దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

by Taduka Kalyani |

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 250 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని అధికారులకు బదిలీ చేశారు. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story