- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోల్ ప్లాజా వద్ద ఆశాకార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి తరలిన నేపథ్యంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు కారణం అయింది.

దిశ, తిమ్మాపూర్ : తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు శనివారం హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి తరలిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు కారణం అయింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బస్సులలో వెళ్తున్న ఆశా వర్కర్లను రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశాకార్యకర్తలు రహదారి పై నిలబడి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆశావర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కరీంనగర్ పీటీసీ సెంటర్ కి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటని ఆశా కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు.






