పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..

by Taduka Kalyani |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పేకాట, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story