జగిత్యాల బస్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు

by Dishafeatures2 |
జగిత్యాల బస్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ నేపథ్యంలో భారీగా జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం మీదుగా రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ఆర్మూర్ నిజామాబాద్ కోరుట్ల, ధర్మపురి, కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఉదయం నుంచి బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వ కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించగా ఇదే అదునుగా భావించిన వాహనదారులు తమ వద్ద నుండి డబుల్ చార్జీలను వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు.


Also Read...

మానవులు అంతరించిపోవాలి.. 30 ఏళ్లుగా ఉద్యమం చేస్తోన్న VHEM


Next Story

Most Viewed