ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.

by Disha Web Desk 1 |
ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
X

దిశ, జగిత్యాల రూరల్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన సొంత గ్రామంలో ఇప్పటికి ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను బీజేపీ నాయకులు పన్నాల తిరుపతిరెడ్డితో సందర్శించారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలంలో సచివాలయం నిర్మాణం పూర్తి చేసింది కానీ పేదలకు అందించాల్సిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేకపోతుందో సమాధానం చెప్పాలన్నారు.

సాక్షాత్తు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సొంత గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందలేదన్నారు. అంటే.. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పట్ల ఆ పార్టీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి త్వరితగతిన డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి, ఉపాధ్యక్షుడు సోమేశ్వర, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, కుర్మా రమేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed