అన్ని కులాలకు, అన్ని మతాలకు వేదిక కరీంనగర్: మంత్రి గంగుల

by Dishanational1 |
అన్ని కులాలకు, అన్ని మతాలకు వేదిక కరీంనగర్:  మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తున్నారని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు గురువారం కరీంనగర్ సింది భవన్ లో సింధ్ కులస్థుల ఆరాధ్య దైవం అయిన చీటీ చంద్ జూలే లాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ అన్ని కులాలకు, అన్ని మతాలకు వేదిక అన్నారు. నగరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో కలిసి మెలిసి జీవిస్తున్నారని.. వ్యాపారులు తమ వ్యాపారాన్ని సవ్యంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. 15 సంవత్సరాల నుండి నగరంలో 144 సెక్షన్, కర్ఫ్యూ, అల్లర్లు, చందాలు, దందాలు లేవని అన్నారు. సింధ్ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వ భూమితోపాటు రూ. 50 లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్, వై సునీల్ రావు, గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్లు పిట్టల వినోద-శ్రీనివాస్, వంగల శ్రీదేవి -పవన్, తోట రాములు, జూలీ లాల్ సేవా సమితి అధ్యక్షులు దిలీప్ కుమార్, మొత్వాని, ప్రధాన కార్యదర్శి వినోద్ సైనాని, రాజేష్ చంద్ నానీ, మోహన్ లాల్, రాం చంద్, జామన్ దాస్, ఏవి రమణ, ప్రేమ్ కుమార్ ముందడా, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed