గల్లంతైన శ్రీకర్... రంగంలోకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by velandi.Saikiran |

పెద్దపూర్ ఎస్సార్ఎస్పీ కాలువలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన తెలిసిందే. అందులో ముగ్గురు ఆచూకీ లభించగా మెట్ పల్లి

గల్లంతైన శ్రీకర్... రంగంలోకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, కోరుట్ల: పెద్దపూర్ ఎస్సార్ఎస్పీ కాలువలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన తెలిసిందే. అందులో ముగ్గురు ఆచూకీ లభించగా మెట్ పల్లి మాజీ జెడ్పిటిసి రాధా- శ్రీనివాస్ ల కుమారుడు శ్రీకర్ రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. దింతో నిన్నటి నుంచి పోలీస్,ఫైర్, గజ ఈత గాళ్ళ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.... గురువారం మాజీ జెడ్పిటిసి రాధా, శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడద్దని భరోసా కల్పించారు. శ్రీకర్ ఆరోగ్యంతో తిరిగి వస్తాడని వారి కుటుంబానికి దైర్యం చెప్పారు. వీరి వెంట మాజీ మంత్రి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగారావు తదితరులు ఉన్నారు.

Next Story