విషాదం.. వడదెబ్బతో ఎంఈఓ మృతి

by Disha Web Desk 12 |

దిశ, చొప్పదండి: వడదెబ్బతో మండల విద్యాధికారి మృతి చెందిన ఘటన చొప్పదండి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చొప్పదండి పట్టణానికి చెందిన బత్తుల భూమయ్య జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎండపల్లి మండలంతో పాటు వెల్గటూర్ మండలం ఇన్చార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా వడదెబ్బతో శనివారం ఉదయం ఐదు గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య ఒక కొడుకు కూతురు ఉన్నట్లు తెలిపారు. భూమయ్య మృతికి పలువురు ప్రజా ప్రతినిధులు ఉద్యోగ సంఘాలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story

Most Viewed