కరీంనగర్ లో 'మేమ్ ఫేమస్' చిత్ర యూనిట్ సందడి

by Disha Web Desk 1 |
కరీంనగర్ లో మేమ్ ఫేమస్ చిత్ర యూనిట్ సందడి
X

దిశ, కరీంనగర్ : నూతన నటీనటులతో తెరకెక్కిన 'మేమ్ ఫేమస్' చిత్ర యూనిట్ శుక్రవారం కరీంనగర్ లో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా శుక్రవారం చిత్ర బృందం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నగరంలోని శ్వేత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ యువతపై తీసిన తమ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగాధర మండలం తాడిచెర్రి గ్రామంలో ఈ చిత్రాన్ని తీసినట్లు వారు తెలిపారు. ఆ గ్రామ ప్రజలు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ప్రత్యేకంగా గ్రామస్థుడు రామిడి సతీష్ సురేందర్ ఎంతో సహకరించారని తెలిపారు. అదేవిధంగా ఉప్పర్ మల్యాల గ్రామంలో సైతం సినిమా షూటింగ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ చిత్రం యువతకు హత్తుకునేలా ఉంటుందని, సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరూ మేమ్ ఫేమస్ గా ఫీల్ అవుతారని తెలిపారు.

చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ కొత్తవారైన ప్రజలు తమకు ఆదరించి ఆశీర్వదించారని తెలిపారు. సినిమా విడుదలైన ఐదు రోజుల్లో రూ.5కోట్లు రాబట్టిందన్నారు. ముక్తా శ్రీనివాస థియేటర్ లో ప్రేక్షకులతో కిలిసి చిత్ర యూనిట్ సినిమాను తిలకించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్, నటులు లక్ష్మణ్, మనీ, కిరణ్, సంగీత దర్శకుడు కళ్యాణ్, అంజి మామ, శివ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed