మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

by Bhanu |

మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతుర్తి గ్రామానికి చెందిన భూతగడ్డ సతీష్ (37) గత కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు.

మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
X

దిశ, ధర్మారం: మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతుర్తి గ్రామానికి చెందిన భూతగడ్డ సతీష్ (37) గత కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో గ్రామంలోనీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సతీష్ కు భార్య శ్రీలత తో పాటు ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు. కొంతకాలం గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ ఉద్యోగిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు .ఈ క్రమంలో అతడు మద్యానికి బానిసై మద్యం మత్తులో పురుగుల మందు తాగి మృతి చెందాడని అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.

Next Story