రోడ్డుపై బైఠాయించిన లారీ డ్రైవర్లు

by velandi.Saikiran |

రోడ్డుపై లారీ డ్రైవర్లు బైఠాయించి... ఆందోళన చేసారు. ఇసుక లారీల్లో లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు రోడ్డుపైనే బైఠాయి

రోడ్డుపై బైఠాయించిన లారీ డ్రైవర్లు
X

దిశ, మంథని : రోడ్డుపై లారీ డ్రైవర్లు బైఠాయించి... ఆందోళన చేసారు. ఇసుక లారీల్లో లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు రోడ్డుపైనే బైఠాయించారు. మంథని మండలం అడవి సోమన్ పల్లి (వల్లంకుంట) క్వారీ వద్ద రోడ్డుపై డ్రైవర్లు నిరసనకు దిగారు. లోకల్ లారీలకు డబ్బులు తీసుకోని క్వారీ యజమానులు లోడింగ్ చేసి పంపుతున్నారని ఆరోపించారు. 10 రోజుల పైగా లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నామని.. అయినా లోడింగ్ చేయడం లేదని వాపోయారు. వెంటనే ఇసుక లోడింగ్ చేసే విధంగా చూడాలని అధికారులను కోరారు. సంఘట స్థలానికి పోలీసులు చేరుకొని... హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Next Story