కొండగట్టు అంజన్న సేవలో దేవదాయ శాఖ మంత్రి సతీమణి

by Disha Web Desk 1 |
కొండగట్టు అంజన్న సేవలో దేవదాయ శాఖ మంత్రి సతీమణి
X

దిశ, మల్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు ఆదివారం తో ముగియనున్న సందర్బంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని లక్ష తమలపాకులు, వివిధ రకాల ఫలాలతో అందంగా అలంకరించారు.

స్వామి వారికి పట్టు వస్త్రాలు, పంచామృత అభిషేకం, ఉయ్యాల సేవ, తిరుమంజనం, ద్రావిడ ప్రబంధం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదని భక్తులు ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed