చక్కెర ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలి: కల్వకుంట్ల సుజీత్ రావు

by Dishanational1 |
చక్కెర ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలి: కల్వకుంట్ల సుజీత్ రావు
X

దిశ, మల్లాపూర్: మండలంలోని చిట్టాపుర్ గ్రామంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుట్ల నియోజకవర్గ చెరుకు రైతులు చెరుకును కామారెడ్డి ఫ్యాక్టరీకి తరలించడానికి రవాణా ఖర్చు ఎక్కువైతుందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అనంతరం చిట్టాపూర్ గ్రామంలో భీమన్న స్వామి వారి 27వ వార్షికోత్సవ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ సర్పంచ్ సాయికుమార్, భూమేష్, రాజు, శ్రీనివాస్, రవి, రవిందర్, భూమానందామ్, గంగాధర్, ఉషాలు, మురళి, టీపీసీసీ ఫిషేర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, ఉమ్మడి జిల్లా మష్య కార్మిక డైరెక్టర్ కల్లెడ గంగాధర్, మామిడి రాజశేఖర్ రెడ్డి, కొమ్ముల చిన్న రెడ్డి, ఇప్పపెల్లి గణేష్, బైండ్ల శ్రీకాంత్, మొగిలి రాజేందర్, అన్వర్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed