- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు
by Disha Web Desk 1 |
X
దిశ, కాల్వ శ్రీరాంపూర్: మండల పరిధిలోని పెగడపల్లి గ్రామానికి చెందిన సంపంగి మహేష్ ను గతంలో నాటు సారా తయారు కేసులో తహసీల్దార్ ముందు హాజరు పరచగా ఒక సంవత్సరం పాటు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ఆర్.మహిపాల్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించిన సంపంగి మహేష్ నాటు సారాయి తయారు చేస్తూ మళ్లీ ఎక్సైజ్ అధికారులకు చిక్కడంతో అతడిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. దీంతో మహేష్ కు మూడు నెలలు జైలు శిక్ష విధించగా అతడిని కరీంనగర్ జైలుకి రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ సీహెచ్. ఆనందరావు తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా నాటు సారా అమ్మినా.. సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై శిరీష రెడ్డి, కానిస్టేబుల్ మనోహర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Next Story