విషాదం.. మరో విద్యార్థి మృతి

by Dishanational1 |
విషాదం.. మరో విద్యార్థి మృతి
X

దిశ, జమ్మికుంట: మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన ఒద్ది అభిరామ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి నాలుగు రోజుల క్రితం బైక్ పై నుండి కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హైదరాబాదులో ని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందాడు. అభిరామ్ మృతితో వెంకటేశ్వరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed