అలాంటి ఇండ్లే ఈ దొంగ టార్గెట్.. ఇక కనిపిస్తే మాయమే..

by Disha Web Desk 19 |
అలాంటి ఇండ్లే ఈ దొంగ టార్గెట్.. ఇక కనిపిస్తే మాయమే..
X

దిశ, మెట్‌పల్లి టౌన్: తాళం ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగనుమెట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోటాబాది గ్రామానికి చెందిన బింగి మాధవరావు (50) తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గత 15సంవత్సరాలుగా వివిధ జిల్లాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కాగా, శుక్రవారం మెట్‌పల్లి శివారులోని గోదురు క్రాసింగ్ వద్ద నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. చేసిన దొంగతనాలన్నింటిని ఒప్పుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. అతడి వద్ద నుండి 53.250 గ్రాముల బంగారం, 1518 గ్రాముల వెండి, దొంగతనానికి ఉపయోగించే ఇనుప కడ్డీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గతంలో వివిధ జిల్లాల్లో పాల్పడ్డ దొంగతనాలకు సంబంధించిన వివరాలను విలేకర్లు సమావేశంలో వివరించారు.

Next Story