వెల్గటూర్ లో భారీ వర్షం, తడిసిన ధాన్యం బస్తాలు

by Disha Web Desk 1 |
వెల్గటూర్ లో భారీ వర్షం, తడిసిన ధాన్యం బస్తాలు
X

దిశ, వెల్గటూర్ : మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 42 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతో కూడిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడపోవడంతో మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలంతా తెల్లవార్లు అంధకారంలోనే ఉన్నారు. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు సంచుల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యం కారణంగానే అకాల వర్షాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed