జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గుల్లకోట విద్యార్థులు

by Disha Web Desk 1 |
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గుల్లకోట విద్యార్థులు
X

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని గుల్లకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన గొల్లపల్లి మణితేజ, లింగంపల్లి జగదీశ్వర్ అనే ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 4న నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొనబోతున్నారని పీఈటీ మహేష్ తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.శారద, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి, సర్పంచ్ పోన్నం స్వరూప-తిరుపతి, ఉప సర్పంచ్ బిసగోని శీను, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీజ-మల్లేశం, ముదుగంటి రమణారెడ్డి, సీనియర్ క్రీడాకారులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story

Most Viewed